Monday, June 1, 2009

ప్రజాస్వాములు

కొడుకులు బిడ్డలు కాసుకు లోనై
మూల గుడిసెలో, భోరు వర్షంలో
చలి వణుకులో, వదిలేసేరు
మూలుగుతున్న ప్రజాస్వామ్య ముసలమ్మను.
వచ్చేవాళ్ళూ, పొయ్యేవళ్ళూ
శ్మశాన సంబరం నిన్నటిదాకా.
కులాల కాకి లెక్కలు, మతాల మతలబులు
హోరెత్తించాయ్ ముసలమ్మ గుండెల్ని.
పచ్చనోట్ల గాంగ్రీనుతో నడవలెకున్న
ఆ ముదుసలి శరీరంపై నగల కోసం
కాచుకున్నారు కిరాయి రౌడీలు.
శవాల దిబ్బలో మతాబులు వెలిగించి
అదే వెలుగు అని చూపించే స్వాములు
మన ప్రజాస్వామ్య ఆసాములు.